కట్టంగూర్, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిటిపాముల ఎంపీటీసీ-1 బెల్లి మహాలక్ష్మిసుధాకర్, వార్డు సభ్యులు గోపగాని లింగమ్మ, ముక్కెర మమతతోపాటు మరో 50 మంది ఆ పార్టీకి రాజీనామా చేసి శనివారం నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో మనుగడ లేదని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా అమలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో పని చేసి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండల్, పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని నాగరాజు, నాయకులు బీరెల్లి ప్రసాద్, కొమ్ము కోటి పాల్గొన్నారు.