కోదాడ, మే 06 : కోదాడ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులోని సాలార్జంగ్ పేటలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డులలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వార్డు కౌన్సిలర్ చీమ నరేశ్ మాట్లాడుతూ వార్డును మున్సిపాలిటీ పరిధిలో రోల్ మోడల్ గా నిలుపుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. కాగా ఆ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, లబ్ధిదారులకు కౌన్సిలర్ నరేశ్ రేషన్ను అందజేశారు.

కోదాడ పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి : చైర్పర్సన్ ఎర్నేని కుసుమ