జలాల్పూర్ గ్రామం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ గ్రామంలో ఇప్పటికే సుందరమైన లేక్వ్యూ పార్కు అందుబాటులోకి రాగా.. మరిన్ని సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.40లక్షలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేయగా.. నిధులు సమకూర్చేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సానుకూలంగా స్పందించారు. వీటి ఏర్పాటుతో జలాల్పూర్కు పర్యాటక శోభ రానుంది.– యాదాద్రి భువనగిరి,మార్చి 9 (నమస్తే తెలంగాణ)/ భూదాన్ పోచంపల్లి
మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాల్పూర్ గ్రామంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ పకన ఉన్న ఈ చెరువు చుట్టూ కొండలతో పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇటీవల పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఎలా ఉండాలో కలెక్టర్ స్వయంగా డ్రాయింగ్ వేశారు. దీంతో అధికారులు టూరిజం అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లక్నవరం మోడల్ను అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. లక్నవరంలో చెరువు మధ్య వరకు మాత్రమే బ్రిడ్జి ఉంటుంది. అది కూడా సస్పెన్షన్ బ్రిడ్జి. వేలాడుతూ ఉంటుంది. ఇకడ కూడా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్కు దగ్గరగా ఉండటంతో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించడానికి అవకాశం ఉంటుంది.
సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు చెరువు వద్ద బోటింగ్ సదుపాయం కల్పించనున్నారు. జిల్లాలో ఎకడా బోటింగ్ థ్రిల్ లేదు. ఈ నేపథ్యంలో ఇకడ బోటింగ్కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పిల్లలతో పాటు పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఇకడికి ఏటా 18 రకాల వలస పక్షులు వస్తుంటాయి. అంతేకాకుండా చెరువు పెద్దగా లోతు లేకపోవడంతో పక్షులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇకడే బర్డ్స్ శాంక్షరీ, సోలార్ లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ అమర్చనున్నారు. చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సుమారు రూ.40 లక్షలు అవసరం పడుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జలాల్పూర్కు వచ్చిన కలెక్టర్ నిధుల గురించి ఎమ్మెల్యే శేఖర్రెడ్డిని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
జలాల్పూర్ చెరువు దగ్గర ఇప్పటికే లేక్ వ్యూ పారును ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.20లక్షలు వెచ్చించారు. పిల్లలు, పెద్దలు కుటుంబ సభ్యులతో సందర్శించడానికి సుందరంగా తీర్చిదిద్దారు. యూత్ రీఫ్రెష్ అయ్యేలా అందుబాటులోకి తెచ్చారు. గత నెల 28న దీన్ని ప్రారంభించారు. ఇకడే ఓపెన్ జిమ్, సిట్టింగ్ ఏర్పాట్లు, బుద్ధ విగ్రహం, పులి, జిరాఫీ, ఆపిల్ బెంచ్, లాన్స్, పిల్లలు రీఫ్రెష్ అయ్యేలా గేమ్స్ ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిష్ పాండ్ ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా, జలాల్పూర్ గ్రామం పచ్చదనం, పరిశుభ్రత విభాగంలో నేషనల్ అవార్డు షార్ట్ లిస్టులో ఉంది. సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే ఈ అవార్డు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జలాల్పూర్ గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎంతో బాగుంటుంది. చెరువులోకి వచ్చే వలస పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి జరుగుతుంది.
– పర్నె రజితామల్లారెడ్డి, జలాల్పూర్ గ్రామ సర్పంచ్
పోచంపల్లి ఇప్పటికే పర్యాటకంగా అభివృద్ధి చెందింది. దానికి అనుబంధంగా ఉండాలనే ఉద్దేశంతో జలాల్పూర్ వద్ద చెరువును అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చెరువు మధ్య వరకే బ్రిడ్జి ఉండేలా, పక్షుల కోసం శాంక్షరీ ప్లాన్ చేశాం. నిధుల కోసం ఎమ్మెల్యేకు ప్రతిపాదించగా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
– పమేలా సత్పతి, కలెక్టర్, యాదాద్రి భువనగిరి