నల్లగొండ, మార్చి 11 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు తమ డేటాను వెంటనే సమర్చించాలని కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. టీఎస్ ఐపాస్, డీఐపీసీ కింద వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలు సకాలంలో పరిశీలించి అనుమతులు ఇస్తుండగా.
నిర్దేశించిన సమయంలో అనుమతులు ఇవ్వడంపై ఎకువ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. డీఐపీసీ కింద ఎస్సీ, ఎస్టీ యూనిట్లకు సుమారు 56 దరఖాస్తులు రాగా, వాటన్నింటినీ పరిశీలించి సిద్ధంగా ఉంచడం జరిగిందని, రవాణా శాఖ అనుమతి వచ్చిన తర్వాత వాటికి మంజూరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.