రామగిరి, మార్చి 26 : ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఓటరు అవగాహనపై మంగళవారం నల్లగొండ ఎన్జీ కళాశాల నుంచి గడియారం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు, పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు భాగస్వామ్యమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనని, కుల, మత, లింగ బేధం లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిందని అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. ఎన్నికల సంఘం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 85 సంవత్సరాలు నిండిన వృద్ధులతోపాటు దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని తెలిపారు.
హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ -12 డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లేదంటే సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, జడ్పీ సీఈఓ ప్రేమ్కర్ణ్రెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, రెడ్క్రాస్ సంస్థ సభ్యులు ఏసీహెచ్. పుల్లారావు, డీఎస్డీఓ పాల్గొన్నారు.