నల్లగొండ రూరల్, జనవరి 5 : నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి (సీఎం ఆర్ఎఫ్) అండగా ఉంటుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాలడుగు సుజాత అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నది. ఆమెకు మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్ఓసీ, నల్లగొండకు చెందిన కంది కమలమ్మకు మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నల్లగొండలోని తన నివాసంలో గురువారం అందజేశారు.
కొత్తపల్లి సర్పంచ్ రొమ్ముల నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, చింత సైదులు, సందినేని జనార్దన్రావు, ఫొటో జర్నలిస్టు వేణుగోపాల్ పాల్గొన్నారు.