యాదగిరిగుట్ట, మే22 : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్టకు వస్తున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై సానుకూల ప్రకటన చేయాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్లుగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని పలుమార్లు వినతి పత్రం అందజేశామని, ఇందుకు సంబంధించిన రిపోర్టు సైతం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. సీఎం వెంటనే రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలన్నారు గతంలో తిరుమలాపూర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారన్నారు.
ఇందులో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని, నిర్వాసితులకు వెంటనే ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. గుట్టలో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అక్రమ క్రషర్లు, ఇసుక రవాణా చేస్తున్న సందర్భంగా రహదారులు పూర్తిగా నాశనమయ్యాయని, వెంటనే రెన్యువల్ చేయాలని, పెండింగ్లో ఉన్న హైలెవెల్ బ్రిడ్జిలు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎస్టీ సబ్ ప్లాన్, టీయూఎఫ్ఐడీసీ నిధులతో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి, పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపాలని, ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.