123 మంది బాధితులకు రూ.43.89 లక్షలు పంపిణీ
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 123 మంది బాధితులకు రూ.43.89 లక్షల విలువైన సీఎం రిలీఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రిదే అని గుర్తు చేశారు.
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు తెచ్చేందుకు ముఖ్యమత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జగదీశ్రెడ్డిల సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, వంగాల ప్రతాప్రెడ్డి, జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, మార్కెట్
చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, దేవరకొండ మండల రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మెన్ వల్లపురెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్ గౌడ్, మాజీ మున్సి పల్ చైర్మన్ వడ్త్యా దేవేందర్నాయక్, పున్న వెంకటేశ్వర్లు, అర్వపల్లి నర్సింహా, బొడ్డుపల్లి కృష్ణ, అశోక్, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసంః ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని తాటికోల్కి చెందిన యువతకు క్రికెట్ బ్యాట్ కిట్టును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణగౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, మండల రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పున్న వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.