అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. దేవరకొండలో బుధవారం 300 మంది బీసీలకు ప్రభుత్వం నుంచి మంజూరైన లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంట్తో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు ద్వారా దేవరకొండ నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల్లో 3.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నదని తెలిపారు.
దేవరకొండ, ఆగస్టు 16 : రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమారులు అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నియోజకవర్గంలోని 300 మంది వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష విలువైన చెక్కులను వారు అందించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6200 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, రానున్న సంవత్సర కాలంలో ప్రాజెక్ట్ పూర్తవుతుందన్నారు. దాంతో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలో రైతుబందు నిధులు రూ.125 కోట్లు రైతులకు ఖాతాల్లో జమ అయినట్లు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా మారుమూల తండాలకు సైతం స్వచ్ఛమైన తాగునీటిని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష అందించడం గొప్ప విషయమన్నారు. అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 11 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందుతున్నాయని వారు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే 232 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని మనమే పాలించుకునే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించాలని చెప్పారు. నియోజకవర్గంలో గుడిపల్లి మండలం కొత్తగా ఏర్పాటైందన్నారు. ఏర్పాటు కానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలో 5 రిజర్వార్ల పనులు పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందన్నారు. పేదల కోసం పని చేసే సీఎం కేసీఆర్కు మనమంతా అండగా ఉందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, పార్వతి, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కేతావత్ బాలూనాయక్, పస్నూరి సరస్వతమ్మ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, దొంతం చంద్రశేఖర్రెడ్డి, రాజినేని వెంకటేశ్వర్రావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు కేసాని లింగారెడ్డి, ఉజ్జిని విద్యసాగర్రావు, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు తూం నాగార్జున్రెడ్డి, వల్లపురెడ్డి, ముక్కమాల బాలయ్య, జంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.