నల్లగొండ, ఆగష్టు 26 : ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నీటి పారుదల శాఖకు నిధులు విడుదల చేయకుండా ఆ శాఖను నిర్వీర్యం చేయగా, 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్తోనే ఆ శాఖకు ప్రాధాన్యం ఏర్పడిందని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. గురువారం స్థానిక టీఎన్జీఓస్ భవన్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖను బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు మూడు శాఖలను ఏకీకృతం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
ఇరిగేషన్ శాఖను ఏకీకృతం చేయడంతోపాటు ఒక్కప్పుడు ఉమ్మడి జిల్లాలకు జిల్లా అధికారులుగా ఉంటే, నేడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకే సీఈ పోస్టులను క్రియేట్ చేసి ఆ శాఖకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కొంత మంది ఉద్యోగుల విధుల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నందున వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎంను కోరినట్లు తెలిపారు. ఆ శాఖలో క్యాడర్ స్ట్రెంత్ పెంచి ప్రమోషన్లు చేపట్టాలని కోరగా, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కానున్నట్లు చెప్పారు. అదేవిధంగా వీఆర్ఓ, వీఏఓల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పండుగల సీజన్ ప్రారంభమైనందున పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం అధ్యక్షుడిగా మేడి జయరావు, కార్యదర్శిగా మధుసూదనాచారి, కోశాధికారిగా మనోజ్ ప్రదీప్కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా రవికిరణ్, మహేశ్ ఎన్నికయ్యారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు మంత్రవాది శ్రవణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్, కోశాధికారి, నీటి పారుదల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మేడి జయరావు, మాధవి, ఆకునూరి లక్ష్మయ్య, నాగిళ్ల మురళి పాల్గొన్నారు.