శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలానికి ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయడాన్ని హర్షిస్తూగురువారం మండల కేంద్రంలోని అంభేద్కర్ చౌరస్తా వద్ద దళితనాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి సీఎం కేసీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మామిడి సర్వయ్య, ఎంపీపీ గంట లక్ష్మమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, గుండా శ్రీనివాస్, తాళ్లూరి మురళి, లోకసాని రంగారెడ్డి, గంట శంకర్, దాసరి వెంకన్న, బండారు శంకర్, దుబ్బ వెంకన్న, మామిడి రమేశ్, గుండ్లపెల్లి నాగయ్య, నిమ్మల సాయిబాబ, సురేశ్గౌడ్, రాచకొండ గణేశ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.