తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ. 25,78, 500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనారోగ్యంతో వైద్యం చేయించుకునే స్తోమతలేని ఎంతోమంది పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అండగా నిలిచాయన్నారు.
అదేవిధంగా తిరుమలగిరిలోని మండలానికి చెందిన పది మంది లబ్ధిదారులకు 4లక్షల 49వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అంతేకాకుండా నాగారం మండలం వర్దమానుకోట గ్రామానికి చెందిన దండ అవిల య్యకు 60వేలు, ఫణిగిరి గట్టు కళమ్మకు 60వేలు, నాగారం బి.శోభకు రూ 60వేల సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీలు స్నేహలత,గుండగాని కవితగౌడ్, జడ్పీటీసీ అంజలి, మార్కెట్ చైర్మన్ అశోక్రెడ్డి, డీసీసీబీ డైరె క్టర్ గుడిపాటి సైదులు, మండలాధ్యక్షులు రఘునందన్రెడ్డి, తాటికొండ సీతయ్య, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, తునికి సాయి లు, దొంగరి శ్రీను, దాసు, కుంచాల శ్రీనివాస్రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్ కుమార్, కూరం వెంకన్న, మంచినీళ్ల మహేందర్, తీగుళ్ల యాదగిరి, రాంరెడ్డి, దర్శనం శేఖర్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.