రాష్ట్ర కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు మహా గౌరవం అందించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభివర్ణించారు. అంబేద్కర్ చరిత్రను వర్తమానానికి అందించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా ఉంటుందని తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి మంత్రి జగదీశ్రెడ్డి.. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డితో కలిసి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టడం గొప్ప నిర్ణయమని, దేశంలోని మిగతా రాష్ర్టాలు కూడా ఇదే సంప్రదాయం పాటిస్తే బాగుంటుందని సూచించారు. దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అంబ్కేదర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారానే సాకారమైందని గుర్తు చేశారు.
– సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 15
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం దళిత సంఘాలతోపాటు వివిధ వర్గాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నకిరేకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. చిట్యాలలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. తుంగతుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి.. నల్లగొండ,హుజూర్నగర్, శాలిగౌరారం, నాగారం, అడ్డగూడూరు, మోత్కూరులో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం సాయంత్రం సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, శానంపుడి సైదిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని మిగతా రాష్ర్టాలూ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని సూచించారు. దేశ రాజధానిలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ.. పార్లమెంట్కు అంబ్కేదర్ పేరు పెట్టేవరకూ పోరాడుతామని తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్గా మారారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, జిల్లా అధ్యక్షుడు రవి, టీఆర్ఎస్ రాష్ట కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకుడు చిన శ్రీరాములు, పట్టణాధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, భరత్ మహాజన్, జ్యోతీకరుణాకర్, శ్రీవిద్య, పూర్ణ శశికాంత్, మార్కెట్ డైరెక్టర్లు సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తుంగతుర్తి : రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు ప్రకటించడంపై తుంగతుర్తిలో టీఆర్ఎస్ నాయకుడు తకడమళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కిశోర్కుమార్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, ఎంపీటీసీ చెరుకు సృజన, కటకం వెంకటేశ్వర్లు, తునికి సాయిలు, ఎల్లబోయిన భిక్షం, ఆకారపు సైదులు, కొండగడప నాగయ్య, భిక్షం, సైదులు, మద్దెల మహేశ్, బొంకూరి మధు, శ్రీకాంత్, నారాయణ పాల్గొన్నారు.
నాగారం : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవరకొండ మురళి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నాయకులు సైదులు, పరశురాములు, యాదగిరి, కిష్టయ్య, పరశురాములు, శ్రీకాంత్, శోభన్, మల్లేశ్, పండు, విజయ్, వీరయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్బాబు, బట్ట వీరబాబు, పాక రాములు, చిరబోయిన శ్రీనివాస్, శంకరయ్య, వెంకన్న పాల్గొన్నారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు హర్షణీయం : ఎమ్మెల్యే నోముల
హాలియా : రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేద్కర్పై ఉన్న గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరోసారి సగర్వంగా చాటుకున్నారని ప్రశంసించారు. పార్లమెంట్ భవనానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్ర పరిపాలనా సముదాయమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడం తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు.
నకిరేకల్ : సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ నకిరేకల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ధనలక్ష్మి, నగేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాయకొండ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నవీన్రావు, సైదిరెడ్డి, కేతేపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు మారం వెంకట్రెడ్డి, చివుట వెంకన్న పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు దళిత బిడ్డగా పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ గొప్ప దార్శనికుడిగా నిలుస్తున్నారన్నారు. అనంతరం నాయకులు మెయిన్ సెంటర్లో పటాకులు కాల్చారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, పందిరి గీతారమేశ్, బెల్లి సత్తయ్య, సిలువేరు మౌనికాశేఖర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, నాయకులు మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, సైదులు, సత్యనారాయణ, బొందయ్య, నర్సింహ, ప్రవీణ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
తిరుమలగిరి : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహలత, జడ్పీటీసీ అంజలి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : టీఆర్ఎస్ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బలకబత్తిరి సౌజన్య, నాయకులు మధు, గమనియేల్, కృష్ణ, సాయి, వెంకటేశ్వర్లు, భాస్కర్, శ్రీను, గోపి, వెంకన్న, ఓంకార్ పాల్గొన్నారు.