రామగిరి, మార్చి 9 : మహా శివరాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా నల్లగొండ పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో శనివారం ఉదయం పార్వతీ పరమేశ్వరుల పల్లకి సేవ, అగ్నిగుండాల కార్యక్రమా న్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగాయి.
ఉత్సవాల్లో భాగంగా రాత్రి హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. చుట్టూ పచ్చని పొలాలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో కోనేరులో తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకున్నది. ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ శివరాంరెడ్డి, రుద్రసేన, అల్గుబెల్లి తిరుమల్రెడ్డి, హరిబాబు, రవి, శేఖర్రెడ్డి, కృష్ణమోహన్ శర్మ, వెంకట్, జీవీ రావు, ఆలయ అర్చకులు ఉదయ్కుమార్, అజయ్కుమార్ పాల్గొన్నారు.