చౌటుప్పల్, ఆగస్టు 26 : వినాయక విగ్రహాల తయారీకి చౌటుప్పల్ కేరాఫ్గా మారింది. పట్టణంలోని వలిగొండ చౌరస్తా దగ్గర గణేశ్ విగ్రహాలు వివిధ ఆకృతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. రాజస్థాన్వాసులు 3నుంచి 10 అడుగుల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది రూ.20లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతుండడంతో వినాయక విగ్రహాల విక్రయానికి చౌటుప్పల్ అతిపెద్ద మార్కెట్గా మారింది.
పాతికేండ్లుగా విగ్రహాల తయారీ..
రాజస్థాన్కు చెందిన రమేశ్ 25 ఏండ్ల క్రితం చౌటుప్పల్కు వలస వచ్చాడు. స్థానిక వలిగొండ చౌరస్తాలో చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు. మొదటి నాలుగేండ్లు ఐదు నుంచి పది విగ్రహాల చొప్పున తయారు చేయగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 200 నుంచి 300 వరకు విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఇక్కడ తయారవుతున్న విగ్రహాలను యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొత్తగూడెం, బాటసింగారం ప్రజలు కొనుగోలు చేస్తుంటారుచౌటుప్పల్లో 25ఏండ్లుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాం. 3 నుంచి 10 అడుగుల ఎత్తు గల విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కరోనా సమయంలో కొంత ఇబ్బంది పడ్డాం. ప్రస్తుతం అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. రాజస్థాన్వాసులం కాస్తా ఇప్పుడు తెలంగాణవాసులుగా మారిపోయాం. – రమేశ్, విగ్రహాల తయారీదారుడు