కొండమల్లేపల్లి, మే 26 : ఖమ్మ- వరంగల్-నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ కోరారు. అదివారం మండల కేంద్రం లో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఓటేసినందుకే రాష్ర్టాన్ని కాంగ్రెసోళ్లు ఆగం చేస్తున్నారని, మళ్లీ వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు.
విదేశాల్లో ఉన్నత ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేయడానికి వచ్చిన రాకేశ్రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని, ఆయనను గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తారన్నారు. సామన్య కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్రెడ్డిని గెలిపిస్తే పెద్దల సభలో ప్రశ్నించే గొంతుకగా వ్యవహరిస్తూ పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, గండబోయిన లింగం యాదవ్, పెద్దిశెట్టి సత్యం, రావుల వెంకటయ్య, దాచేపల్లి నరేందర్, వరికుప్పల పాండు, తోటపల్లి శ్రీను, బోడగిరి, ముడావత్ పాండు, గోవింద్నాయక్, పి.ఏరుకొండ లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.