కేతేపల్లి, నవంబర్ 7 : అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కొర్లపహాడ్, ఇప్పలగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్తో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లింగయ్యయాదవ్ మాట్లాడుతూ గత పాలకుల కాలంలో మన ప్రాంతం తీవ్ర వివక్షకు గురైందన్నారు. ప్రాంతీయ భేదంతో సీమాంధ్ర పాలకులు మన సంపదను దోచుకుపోయారని విమర్శించారు. ప్రజల కష్టాలను చూసి సీఎం కేసీఆర్ ప్రత్యే క రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటు వేసి చిరుమర్తి లింగయ్యకు భారీ మెజార్టీ తీసుకురావాలన్నారు.
అభివృద్ధి చేశాను ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ప్రచారానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఆయా గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటువేయమని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పూటకోమాట వెంకట్రెడ్డి మాట్లాడడం, రాజగోపాల్రెడ్డి ఏడాదికో పార్టీ మా రుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. రాజగోపాల్రెడ్డిలా రాజకీయాల కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం తనది కాదని అన్నారు. తాను అభివృద్ధి కోసమే పార్టీ మారానని సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. నకిరేకల్లో సీఎం కేసీఆర్ అండతో అందరికీ సంక్షేమ పథకాలను అందించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులను చూసి కారుగుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధిక సంఖ్యలో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామా ల్లో జరిగిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, ఇప్పలగూడెం సర్పంచ్, ఉపసర్పంచ్ డి.వీరయ్య, పి.శేఖర్, పలు గ్రామాల సర్పంచ్లు బి.శ్రీనివాస్యాదవ్, బచ్చు జానకీరాములు, కె.శ్రవణ్, నాయకులు కె.సైదిరెడ్డి, ఎ.సత్యనారాయణ, సీహెచ్.అంజయ్య, వి.చేతన్, డి.సుధాకర్, ఎం.విజయరాణి పాల్గొన్నారు.
నకిరేకల్లో బీఆర్ఎస్ వైబ్రేషన్ నడుస్తున్నది : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ : నకిరేకల్లో బీఆర్ఎస్ వైబ్రేషన్ నడుస్తున్నదని, సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని మోదినిగూడెం, నర్సింహాపురం, తాటికల్ గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల సోమన్న, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి నాయకులు సోమ యాదగిరి, తక్కెళ్లపల్లి ప్రభాకర్రావు, పేర్ల కృష్ణకాంత్, మోదినిగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు జానయ్య, శ్రీనివాస్, రామలింగయ్య
పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చందుపట్ల శేఖర్, చందుపట్ల రవీందర్, మునగ లచ్చయ్య, చింత సర్వయ్య, సైదులు, మంద అశోక్, చింత ప్రభాకర్, ఉన్నారు. కార్యక్రమం లో పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత, మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, సర్పంచ్ బచ్చు జానకీరాములు, ఉపసర్పంచ్ తండు రాములుగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆర్.సైదులుగౌడ్, నాయకులు డి.సునీత, డి.లింగయ్య, డి.లింగయ్య, వి.యాదగిరి, వి.సత్యనారాయణ, జె.యాదగిరి, షేక్ యూసుఫ్అలీ పాల్గొన్నారు.
నకిరేకల్ : చందంపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చీమల లింగయ్య, విప్పలపల్లి పుల్లయ్య, చిర్రబోయిన రాము, మీడబోయిన సైదులు, విప్పలపల్లి శ్రీను, విప్పలపల్లి భిక్షమయ్య, కావేటి జంగయ్య, కావేటి మధు, మీడ బోయిన నాగరాజు, చిర్రబోయిన భిక్షం, నాగరాజు, లింగయ్య, నరేందర్, సైదులు, నాగరాజు ఉన్నారు.
చందుపట్ల గ్రామానికి చెం దిన 50 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త చెరుకు సుధాకర్ సమక్షంలో మంగళవారం నకిరేకల్లో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జిల్లా శ్రవణ్కుమార్, జిల్లా సందీప్, డేగటి నవన్, గాదె నవీన్, గాదె సాయి, జిల్లా చంటి, కొత్తపల్లి ప్రశాంత్, జిల్లా ఉమేశ్, చింత సందీప్, కందికంటి శరత్, జిల్లా సాయి, యాతాకుల ప్రవీణ్, ఇరుగదిండ్ల సందీప్, జిల్లా శ్రీరామ్, జిల్లా హేమంత్, పల్లె అఖిల్, జిల్లా మనీ, బచ్చలికూర శివ, జిల్లా ప్రమోద్ ఉన్నారు. కార్యక్రమంలో హంస ఫౌం డేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు సైదిరెడ్డి, యూత్ అధ్యక్షుడు మేడి ప్రశాంత్, చందుపట్ల గ్రామశాఖ అధ్యక్షుడు వనం చందర్రావు,ఎంపీటీసీ ఇమ్మడపాక లక్ష్మీవెంకన్న, నాయకులు మాచర్ల సుదర్శన్, చింతమల్ల వెంకటేశ్, గాదె రాజు పాల్గొన్నారు.