నల్లగొండ రూరల్, నవంబర్ 17 : ఎకరం ఉంటే గంట కరెంట్, మూడు ఎకరాలు ఉంటే మూడు గంటల కరెంట్ ఇస్తామని రైతుల నోట్లో మట్టి కొట్టేలా మాటలు చెబుతున్నా కాంగ్రెసోళ్లను ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ మండలం అన్నెపర్తి ,బుద్దారం, అప్పాజీపేట, రాములబండ,రంగారెడ్డినగర్, దోమలపల్లి, నర్సింగ్భట్ల, పాతూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డ పెళ్లికి చేతి రుమాలు ఇవ్వనోళ్లు ఇయ్యాల మహిళల సంక్షేమ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఓటమి భయంతోనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పుడూ మత్తులో తూళుతున్నాడని, అందు కే సీఎం అభ్యర్థి తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి తరిమికొడితే మళ్లీ రాడన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నల్లగొండలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే కంచర్ల భూపాల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, వైస్ చైర్మన్ తవిట కృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, మహిళ విభాగం అధ్యక్షురాలు కొప్పోల విమలమ్మ, కాసర్ల విజయ రెడ్డి, సర్పంచులు మేకల అరవింద్రెడ్డి, పబ్బతి రెడ్డి రవీందర్రెడ్డి, బకరం యాదమ్మ, రూపాని జయమ్మాపెద్దులు, మామిళ్ల సైదులు , ఉపేంద్రచారి, చామకూరి తేజస్వీని, కారింగ్ సైదులు, బడుపుల శంకర్, పొగాకు ఘట్టయ్య, బుచ్చిరెడ్డి , మాజీ జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, మాజీ ఎం పీపీ నారబోయిన భిక్షం, డాక్టర్ సుహాస్, గోపాల్ రెడ్డి , పనస శ్రీను పాల్గొన్నారు.