నూతనకల్, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడిందని.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే 24 గంటల కరెంట్ ఇవ్వరని, రైతు బంధు బంద్ చేస్తారని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కేసీఆర్ను మరిచిపోవద్దని సూచించారు. తనను మరోమారు గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. ప్రసుత్తం రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా నూతన మ్యానిఫెస్టో ప్రకారం రూ.16 వేలు అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షలు, రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ప్రచార రథంలో మండల కేంద్రానికి రాగా బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. డప్పులు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు.
మహిళలు మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, బత్తుల సాయిల్గౌడ్, బద్దం ప్రశాంత్రెడ్డి, మొగుళ్ల వెంకన్న, బత్తిని లింగయ్య, ఇరుగు మధు, నకిరేకంటి వెంకన్న, వెంకట్రెడ్డి, వీరూయాదవ్, వీరమల్ల యాదగిరి, బత్తుల విజయ్కుమార్, బత్తుల విద్యాసాగర్, సైదిరెడ్డి పాల్గొన్నారు.
తిరుమలగిరి, నవంబర్ 25 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై అండగా ఉండేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. మండలంలోని మామిడాల పంచాయతీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కృష్ణ, మహేశ్, మల్లయ్య, లింగయ్య, భిక్షం, నరేశ్తో పాటు పలువురు నాయకులు తిరుమలగిరిలోని నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘునందన్రెడ్డి, మాజీ ఎంపీపీ సతీశ్ పాల్గొన్నారు.