నడిగూడెం, నవంబర్ 15 : మరోసారి తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గాక కార్యకర్తలా సేవలందిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలో పాల్గొని మాట్లాడారు. నడిగూడెం మండలాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్నేనని పేర్కొన్నారు. నాడు కరెంట్ కోసం రోడ్లెక్కిన ప్రజలు ప్రస్తుతం 24గంటల కరెంట్తో సంతోషంగా ఉన్నారన్నారు. నడిగూడెం గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడే దేశం మొత్తం సెల్యూట్ చేసే జాతీయ జెండా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.
కోదాడ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. ఎలాంటి గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎల్లప్పుడూ మీ వెంట ఉండే నాయకుడిని గుర్తించి ఓటేయాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్కు మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, పార్టీ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, దేవబత్తిని సురేశ్ప్రసాద్, పాలడుగు ప్రసాద్, కాసాని వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్లు పుట్టా రమేశ్, గోసుల రాజేశ్, బడేటి చంద్రయ్య, అనంతుల ఆంజనేయులు, అనంతుల మహేశ్, ఖలీల్ అహ్మద్, బోనగిరి ఉపేందర్, రఫీ, కాసాని ఉపేందర్, దున్నా సుధాకర్, మేకల గంగరాజు, నూనె నాగన్న, నక్కా సతీశ్, దాసరి శ్రీను, బొల్లం శ్రీను, జలీల్, ధనయ్య, ప్రవీణ్, వీరబాబు, మురళి, శివకృష్ణ పాల్గొన్నారు.
మోతె : ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గోపతండా, నేరెడవాయి, తుమ్మగూడెం, నర్సింహాపురం, రావికుంట తండా, కూడలి, సర్వారం, గోల్తండా, బుర్కచర్ల, రాంపురంతండా గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. కోదాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే జరిగిందన్నారు. ఎప్పుడు మీవెంటే ఉండే నాయకుడిని గుర్తించి ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వర్రావు, మిక్కిలినేని సతీశ్, సర్వారం పీఏసీఎస్ చైర్మన్ ముప్పాని శ్రీధర్రెడ్డి, సర్పంచులు నర్సిరెడ్డి, యుగంధర్రెడ్డి, నర్సింహారావు, మిక్కిలినేని పురుషోత్తంరావు, కారింగుల శ్రీనివాస్గౌడ్, దేవలనాయక్, సోమేశ్గౌడ్, సురేందర్రెడ్డి, ఆర్కే నాయక్, ఉపేందర్, మహేశ్, మంజుల, జాన్పాషా పాల్గొన్నారు.