చందంపేట, నవంబర్24: రైతులకు సాగునీరు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తెల్దేవర్పల్లి, పాత తెల్దేవర్పల్లి, మోత్యతండా, బాపన్మోట్తండా, బొల్లారం, బండకిందితండా, దేవరచర్ల, యల్మలమంద, ఉస్మాన్కుంట, పాతకంబాల పల్లి, సర్కిల్తండా, కంబాలపల్లి, పొగిళ్ల, గువ్వలగుట్ట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కంబాలపల్లి లిఫ్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే 5వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములకు హక్కు పత్రాలు కల్పిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని చూసి రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ మారుమూల మండలాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను అమలు చేస్తారని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే వర్షం పడుతున్నప్పటికీ ఎమ్మెల్యే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మహిళలు కోలాట ప్రదర్శనలతోఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బిల్యానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ గోవిందుయాదవ్, కేతావత్ హరిలాల్, దేవరకొండ బంజార సంఘం అధ్యక్షుడు లక్ష్మానాయక్, సర్పంచ్లు పాపానాయక్, అర్జున్నాయక్, దేవానాయక్, గోవర్ధన్,మద్దమడుగు రవి, శవ్వ నారాయణ, శంకర్నాయక్, పార్వతిఇమకట్లాల్, లాల్సింగ్నాయక్, చంద్రబాబు, మీ సేవా రమేశ్, రవి, వెంకటయ్య, శ్రీనివాస్, రామకృష్ణ, మున్నయ్యయాదవ్, గోపాల్రెడ్డి, చంద్రశేఖర్, రవి, పరమేశ్ పాల్గొన్నారు.
చందంపేట మండలంలో మీ సేవ నిర్వహిస్తున్న రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటాల్డుతూ బీఆర్ఎస్ అమలు చేసే సంక్షేమ పథకాలను మండలంలోని తెల్దేవర్పల్లి, పాత తెల్దేవర్పల్లి, బొల్లారం గ్రామాలకు చెందిన వారికి ఉచితంగా దరఖాస్తు చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ గెలుపుతోనే మరిన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని పేర్కొన్నారు.