యాదాద్రి భువనగిరి అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ): ‘రమావత్ రవీంద్రకుమార్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. మంచి మనిషి. యువకుడు. నియోజకవర్గం గురించి పరితపించే నేత. ఎవరినీ బాధ పెట్టని లీడర్. ఎప్పుడు కలిసినా వ్యవసాయం, నీళ్ల గురించే చెప్తారు. అలాంటి మంచి మనిషిని దీవించండి. పోయినసారి కంటే 70 నుంచి 80 వేల మెజారిటీ ఇవ్వాలి. అధికారంలోకి వచ్చాక రవీంద్ర కోరిన డిమాండ్లన్నీ నెరవేరుస్తాం. వీలైనంత త్వరగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. దేవరకొండ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప పేదలకు చేసిందేమీ లేదు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి’ అని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తెలిపారు. మంగళవారం దేవరకొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
“రమావత్ రవీంద్ర కుమార్నాయక్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. మంచి మనిషి. యువకుడు. నియోజకవర్గం గురించి పరితపించే నేత. ఎవరినీ బాధ పెట్టని లీడర్. ఎప్పుడు కలిసినా వ్యవసాయం, నీళ్ల గురించే చెప్తారు. అలాంటి మంచి మనిషిని దీవించండి. పోయినసారి కంటే డబుల్ మెజారిటీతో రవీంద్ర గెలవబోతున్నారు. 70 నుంచి 80 వేల మెజార్టీతో భారీ విజయం ఖాయం. కారు గుర్తుకు ఓటేసి ఆయన దీవించండి.” అని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవీంద్ర కోరిన డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
త్వరలోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి..
కాంగ్రెస్ పార్టీ స్టేల పేరుతో డిండిని ఆపాలని చూసిందని, ఇప్పుడు చికులు పోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు అడ్డుకోపోతే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్ల తర్వాత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. రాబోయే రోజుల్లో డిండి పూర్తి చేస్తామని, దీని ద్వారా ఐదు రిజర్వాయర్లు, ఒక బ్యారేజి వస్తుందని అన్నారు. అంతిమంగా దేవరకొండకు పట్టిన దరిద్రం పోతుందని చెప్పారు. తెలంగాణ రాకముందు.. వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని స్పష్టంగా చూస్తున్నామని, కరెంటు, సాగు, తాగునీటి బాధలు తీరాయన్నారు.
పరిశ్రమలు, కాలేజీల ఏర్పాటు
నియోజకవర్గం వెనకబడిన ప్రాంతమని, ఇకడ పేదరికం పోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. నిరుద్యోగ సమస్య పరిషారానికి ఇకడ పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. రవీంద్రకుమార్ కోరినట్లు నియోజకవర్గంలో అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేస్తామని, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జీఓ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
గిరిజనులకు జీపీలు, రిజర్వేషన్లు అమలు
ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల పరిషారానికి ఎన్నో ఉద్యమాలు చేశారని, మా తండాలో మా రాజ్యం కావాలని అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పా టు చేశామన్నారు. గిరిజనుల కోసం 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ నేతలవి సిగ్గులేని మాటలు..
ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి రైతు బంధు దుబారా అంటూ అడ్డగోలుగా వాగుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మరో కాంగ్రెస్ నేత.. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు చేసింది ఏం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
రవీంద్ర కుమార్ మంచి మనిషి..
దేవరకొండ చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరిగి ఉండదని కేసీఆర్ పేరొన్నారు. పోటీ చేసే వ్యక్తుల వెనుక ఏ పార్టీ ఉన్నారనేది ఆలోచన చేయాలని, వ్యక్తులతో పాటు పార్టీని కూడా గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి, మంచి మనిషి రవీంద్రకుమార్ను మరో మారు గెలిపించాలని పిలుపునిచ్చారు. చీకటి కావడంతో చాపర్కు ఇబ్బంది అవుతున్నదని, అందుకే త్వరగా ముగియాల్సి వస్తున్నదని, దేవరకొండ నియోజకవర్గం ప్రజలు క్షమించాలని సీఎం కోరారు. ఎన్నికల తర్వాత మళ్లీ దేవరకొండకు వస్తానని, ఒక రోజంతా ఇకడే ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు గుత్తా అమిత్ రెడ్డి, బిల్యానాయక్, కడారి అంజయ్యయాదవ్, బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండ అభివృద్ధి ; ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ, అక్టోబర్ 31 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ సహకారంతో దేవరకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో మరో రెండు లిఫ్ట్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని, డిండి ఎత్తిపోతల పనులను వేగవంతంగా చేపట్టాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ఇతర రాష్ర్టాల వారు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీలు సునీతా నార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, పద్మాహన్మనాయక్, జడ్పీటీసీలు మారుపాకుల అరుణ, కేతావత్ బాలూనాయక్, కంకణాల ప్రవీణ, పస్నూరి సరస్వతమ్మ, జడ్పీటీసీ సలహాదారులు మారుపాకుల సురేశ్గౌడ్, కంకణాల వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి. రమావత్ దస్రూనాయక్, ముత్యాల సర్వయ్య, లోకసాని తిరుపతయ్య, రాజీనేని వెంకటేశ్వర్రావు, వల్లపురెడ్డి, దొంతం చంద్రశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్రెడ్డి, శ్రీనివాస్రావు, తూం నాగార్జున్రెడ్డి, ముక్కమాల బాలయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్రావు, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, ఆరెకంటి రాములు, గాజుల ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుంభం శ్రీనివాస్గౌడ్, నేనావత్ శ్రీనునాయక్, దొండే టి మల్లారెడ్డి, కౌన్సిలర్లు రైస్, జయప్రకాశ్నారాయణ, ఇలియాస్, తౌఫిక్, ప్రదీప్, అసోక్, వేములరాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.