మిర్యాలగూడ: బీజేపీ చేస్తున్న పాదయాత్ర అబద్ధపు యాత్ర అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమ వారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే సీఆర్ను స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్న బండి సంజయ్ నిజం తెలుసుకుని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుం టుందన్నారు. పాదయాత్రలో ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరిచే ప్రయ త్నం చేస్తే సహించేది లేదన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఎదైనా ఒక్క మంచి పని చేసిందేమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాకుండా అడ్డు పడటమే కాకుండా పార్లమెంట్లో ధర్నాలు చేసినప్పుడైనా తమకు సహకరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలని అడ్డగోలుగా మాట్లాడుతూ పగటి కలలు కంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాస్తవంలోకి రావాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బీజేపీ ఎలా ఓట్లు అడుగు తుందో అర్ధం కావడం లేదన్నారు. ప్రజలకు ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలో దిక్కు లేని స్థితిలోకి వచ్చిందని ఏడు సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టులు నిర్మించలేదని రేవంత్రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రామ్దాసు వంటి ప్రాజెక్టులు రేవంత్రెడ్డికి కనపడకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్లను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ 136 కేసులు వేసిందన్నారు.
తెలంగాణలో అమలయ్యే 24గంటల కరెంట్, ఉచిత విద్యుత్, రైతుబంద్, రైతుబీమా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. దళితులు రాష్ట్రంలో 17లక్షల కుటుంబాలు ఉండగా ప్రతి కుటుంబానికి రూ.10లక్షల చొప్పున దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా హుజురాబాద్లో 2వేల కుటుంబాలకు రూ.2వేల కోట్లును అందించామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరున గర్ భార్గవ్, ఎంపీపీ నూకల సరళ హనుమంతరెడ్డి, అన్నబీమోజు నాగార్జునాచారి, పెద్ది శ్రీనివాస్గౌడ్, మల్గం రమేశ్, యూసూఫ్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.