మోత్కూరు : మోత్కూరు మండలంలోని బుజిలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెపహాడ్కు చెందిన కొత్తపల్లి రమేశ్(48) అతని భార్య రాములమ్మతో కలిసి బైక్పై శాలిగౌరారం మండలంలోని బైరవోనిబండలోని అత్తారింటికి వెళ్తున్నాడు. బుజిలాపురం గ్రామ సమీపంలో బీటీ రోడ్డుపై వెళ్తున్న గేదెను తప్పించబోయి బైకు అదుపు తప్పి కింద పడ్డారు. ప్రమాదంలో రమేశ్కు అతని భార్యకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో భువనగిరికి తరలిస్తుండగా రమేశ్ మార్గ మధ్యలో మృతి చెందాడు. అతని భార్య రాములమ్మకు తీవ్ర గాయాలు కావడంతో భువనగిరి ఏరియా దవాఖానలో వైద్యం పొందుతున్నది. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సైఐ కరుణాకర్ తెలిపారు.