సూర్యాపేట, డిసెంబర్ 9 : తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి, కేం ద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. కేసీఆర్ దీక్షతో దిగి వచ్చిన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం బీఆర్ఎస్కు పండుగ రోజని, అందుకే విజయ దివస్ పేరుతో వేడుక లు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి గాలిలోకి గులాబీ రంగు బెలూన్లు వదిలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ పుట్ట కిశోర్, నాయకులు ఆకుల లవకుశ, తాహేర్పాషా, బత్తుల రమేశ్, సుంకరి రమేస్, గాలి సాయి, బండారు రాజా, సయ్యద్ సలీం, మొహినోద్దీన్, కరాటే సయ్యద్, ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, ఆంగోతు బావ్సింగ్, మద్దెల వీరస్వామి, సల్మా మస్తాన్, కరుణశ్రీ, చనగాని అంజమ్మ, కల్లేపల్లి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.