అర్వపల్లి, ఫిబ్రవరి 09 : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ.. గర్భిణీలు క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకోవాలన్నారు. గర్భిణీలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సూచించిన విధంగా వ్యాయామం చేసినట్లయితే సాహజ కాన్పులు అవుతారని సూచించారు. సహజ కాన్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, అదే ఆపరేషన్ అయినట్లయితే అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు బోడ సునీత, కళమ్మ, వీరయ్య, అనూష పాల్గొన్నారు.