నీలగిరి, జనవరి 25 : నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న అపూర్వరావును నల్లగొండకు బదిలీ చేసింది. రెమా రాజేశ్వరి ఇటీవల డీఐజీగా పదోన్నతి పొందడంతో ఆమెను రామగుండం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
2021 డిసెంబర్లో నల్లగొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రెమా రాజేశ్వరి ఏడాది కాలం పాటు విధులు నిర్వర్తించి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు గంజాయి, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టిసారించారు. గత నవంబర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. 2014 ఐపీఎస్ ఎంపికైన అపూర్వరావుకు తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి మహిళా ఐపీఎస్గా గుర్తింపు ఉంది.