రామగిరి/ మాడ్గులపల్లి ,మే 25 : తెలంగాణలో అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులు, ఇంజినీరింగ్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎంసెట్ ఫలితాలను గురువారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించి సత్తా చాటా రు. దాంతో కళాశాలల యాజమన్యాలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో శాన్వితారెడ్డికి 7వ ర్యాంకు
ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో నల్లగొండ జిల్లా మడ్గులపల్లి మండలం బొమ్మకల్కు చెందిన వడ్డె శాన్వితారెడ్డి రాష్ర్ర్ట స్థాయిలో 7వ ర్యాంకు సాధించి జిల్లా ఖ్యాతి చాటింది. శాన్వితారెడ్డి 1 నుంచి 5, 7, 8 తరగతులు మిర్యాలగూడలోని ఆదిత్య హైస్కూల్, 6వ తరగతి చలకుర్తి జవహర్ నవోదయ, 9, 10 తరగతులు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలోని కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో చదివింది. ఇంటర్మీడియేట్ చైతన్య జూనియర్ కళాశాల విజయవాడలో పూర్తి చేసి 977 మార్కులు సాధించింది. జేఈఈ మెయిన్స్లో 99.98 పర్సంటైల్ పొందారు. శాన్వితారెడ్డి తండ్రి మధుసూదన్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా తల్లి లలితా గృహిణి. ప్రస్తుతం మిర్యాలగూడలో నివాసం ఉంటు న్నారు.
కలెక్టర్ కావాలని ఉంది
జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్లో ఉత్తమ పర్సంటైల్తో ఐఐటీలో బీటెక్ చేయాలని కోరిక. బీటెక్ పూర్తికాగానే సివిల్స్ చదివి భవిష్యత్లో ఐఏఎస్(కలెక్టర్) కావాలని ఉంది. ఎంసెట్, జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించడానికి అమ్మనాన్నల ప్రోత్సహం ఎంతో ఉంది. వారి ఆశయాన్ని నేరవేర్చడంతోపాటు అందరిలో ప్రత్యేక గుర్తింపుతో ఉండి సమాజ సేవ చేయాలనేదే నా జీవిత ఆశయం.
– వడ్డె శాన్వితారెడ్డి
అగ్రికల్చర్, మెడికల్లో కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల ప్రతిభ
ఎంసెట్ ఫలితాల్లో నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి పూర్తి చేసిన కవల విద్యార్థులు ప్రతిభ చాటారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో కవలలు కత్తుల మాన్యతాదాస్ 799 ర్యాంకు, కత్తుల మన్వితాదాస్ 861 ర్యాంకు సాధించారు. వీరు నల్లగొండలోని జాస్రితా అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. వీరి తల్లి అరుణశ్రీ తిప్పర్తి మండల కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో హెచ్ఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. పాఠశాల ప్రిన్సిపాల్ మినీముళ్లత్, జాస్రితా అకాడమీ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్ ఆదిరెడ్డి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు అభినందనలు తెలిపారు.
గౌతమి విద్యార్థుల విజయదుందుభి
ఎంసెట్ ఫలితాల్లో నల్లగొండలోని గౌతమి కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఇంజినీరింగ్ విభాగంలో వి.ఉమామహేశ్ 1,241 ర్యాంక్, ఎం.స్వాతి 1,259, సుఫియా తబసుమ్ 2,179, కె.సోని 4,407, కె.ఆక్షిత 4,436, అగ్రికల్చర్ విభాగంలో నిషాత్ ఫాతిమా 7,144 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. అలాగే ఇంజినీరింగ్లో 12వేల లోపు ర్యాంకులు పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. విద్యార్థులకు కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డిఅభినందనలు తెలిపారు.
కేఎల్ఎన్ విద్యార్థుల సత్తా
మిర్యాలగూడ : ఎంసెట్ ఫలితాల్లో కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థ్ధులు సత్తా చాటినట్లు కరస్పాండెంట్ కిరణ్కుమార్ తెలిపారు. కళాశాల విద్యార్థిని వీ.పూజశ్రీ 1,089, ఆర్.అక్షయ1,482, సీహెచ్.శ్రీనివాస్రెడ్డి 4,695, ఏ.సాయివిశ్వ 5,350, ఎం.తపస్విని 5,830, శ్రీజ 6,252, ఆర్.అఖిల 6,972 ర్యాంకులు సాధించినట్లు చెప్పారు. అలాగే 10 వేల లోపు ర్యాంకులు 10 మంది, 20 వేల లోపు ర్యాంకులు 20 మంది విద్యార్థులు సాధించినట్లు వెల్లడించారు. కళాశాల డైరెక్టర్లు నరేందర్రెడ్డి, పీఎల్ఎన్ రెడ్డి, హనుమంతరెడ్డి విద్యార్థులను అభినందించారు.
ప్రగతి విద్యార్థుల ప్రభంజనం
రామగిరి : ఎంసెట్ ఫలితాల్లో నల్లగొండలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటరని ఆ కళాశాల యాజమాన్యం వెల్లడించింది. వి.సిరి 800 ర్యాంకుతో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సీహెచ్.రూప 1310, బి.శ్రీలేఖ 1,856, అభియాకౌసర్ 3,291, ఎం. మనోజ్కుమార్ 3,792, బి.దివ్య 3,858 పలువురు విద్యార్థులు 15వేల లోపు ర్యాంకు 54మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. విద్యార్థులకు కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ.నరేందర్బాబు, ఎన్.శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేశ్రెడ్డి అభినందనలు తెలిపారు.