నల్లగొండ : వానకాలం రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్న సందర్భంగా త్రిపురారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు ఇశ్లవత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
సీజన్ ప్రారంభంలో ఇస్తున్న రైతుబంధు డబ్బులు తమకు ఎంతో ప్రోత్సాహకంగా ఉంటున్నాయని రైతులు చెబుతూ సంబురాల్లో పాల్గాన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ క్రమం తప్పకుండా రైతుబంధు డబ్బులు ఇస్తున్నారని ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ అన్నారు.