చివ్వెంల, ఏప్రిల్ 14 : పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జీసీబీతో చదును చేయిస్తున్నాడు. ఈక్రమంలో పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్త గా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.