రామగిరి (నల్లగొండ) మే 22 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ అని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో అనంతరామ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు భవిష్యత్ లేదని కొందరంటున్నరు. కానీ కమ్యూనిస్టులు లేకపోతే దేశానికే భవిష్యత్ లేదన్నారు. అనంత రామ శర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించినట్లు తెలిపారు. పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడి వరకు పని చేశారని గుర్తు చేశారు. కార్మిక ఉద్యమంలో, అనేక యూనియన్లను నిర్మాణం చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, సయ్యద్ హాశం, సీహెచ్ లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గంజి మురళీధర్, సైదులు, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, ఖమ్మంపాటి శంకర్, ఆకారపు నరేశ్, మన్నెం భిక్షం, కోట్ల అశోక్ రెడ్డి, గాద నరసింహ, పి.మధుసూదన్ రెడ్డి, బొల్లు రవీంద్రకుమార్ పాల్గొన్నారు.