బీబీనగర్, జనవరి 11 : రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. మండల కేంద్రంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆవరణలోని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన బిల్లా విశ్వనాథ్ (63) తన కుమార్తె అనలాకు అనారోగ్య సమస్య కారణంగా ప్రతి రోజు బస్సులో ఎయిమ్స్ దవాఖానకు వచ్చేవారు. కూతురును అక్కడ వదిలి టిఫిన్ చేయడానికి రోడ్డు దాటుతుడంగా, జాతీయ రహదారిపై హైదరాబాద్వైపు ప్రయాణిస్తున్న బైక్ నిర్లక్ష్యంగా నడిపి విశ్వనాథ్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విశ్వనాథ్ కుమార్తె అనలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు.
ట్రాక్టర్ ఢీ కొని మహిళ ..
చిట్యాల :మండలంలోని ఏపూరు గ్రామ డీఈసీ కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళ కార్మికురాలు మృతి చెందా డు. ఎస్ఐ ధర్మ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్పూర్ జిల్లా రాయ్గంజ్ మండలం అబ్దుల్ఘాటా గ్రామానికి చెందిన సుకో బర్మన్(43) కొంత కాలంగా సోదరుడు, సోదరితో కలిసి డీఈసీ కంపెనీలో కార్మికురాలిగా పని చేస్తూ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుడిసెలో నివాసం ఉంటుంది. రోజు మాదిరిగా బుధవారం సాయంత్రం పనులు ముగించుకొని గుడిసె వైపునకు వెళ్తుండగా మందుల మహేశ్ ట్రాక్టర్ను అతివేగంగా నడుతూ వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో బర్మన్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి సోదరుడు ఆముల్లోవ సింఘా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.