రామగిరి, జనవరి 5 : విద్యార్థుల్లోని నైపుణ్యాలు వెలికితీసి ప్రతిభకు పదునుపెట్టేలా స్వా మి వివేకానంద జయంత్యుత్సవాల్లో భాగంగా జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని కేపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘జిల్లాస్థాయి యువజనోత్సవాలు’ ఆకుట్టుకున్నా యి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా చదివి జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని సూచించారు.
స్వామి వివేకానందుడు చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని సూచించారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, ప్రతిఒక్కరూ సమాజంపై అవగాహన కలిగి ఉత్తమమైన రంగంలో రాణించాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బాలు మాస్టర్ శిష్యులు చేసిన స్వాగత నృత్యం అలరించింది. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి మక్బూల్ అహ్మద్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు తీగల జాన్శాస్త్రి, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, సమీయుద్దీన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత గంజి రాజేందర్ పాల్గొన్నారు.