భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 3 : భూదాన్ పోచంపల్లి చేనేత సహకార సంఘం, టూరిజం పారును అమెరికాకు చెందిన వీవర్స్ విద్యార్థులు కీయరా జాఫ్రే, గాబ్రియల్ శనివారం సందర్శించారు. చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి కళాకారుల నైపుణ్యం, పనితీరు, వారి జీవన స్థితిగతులను పరిశీలించారు. చేనేత కళాకారుడు భోగ బాలయ్య ఇంటికి వెళ్లి అతను నేసిన వస్ర్తాలను చూసి ప్రశంసించారు.
ఆజాద్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా డబుల్ ఇకత్తో పదివేల రంగులతో బాలయ్య తయారుచేసిన భారతదేశ పటం, చరఖాతో కూడిన వస్ర్తాలను చూసి అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కళాకారుల ప్రతిభ అద్భుతమన్నారు. వారి వెంట చేనేత జౌళి శాఖ డీఓ ప్రసాద్, ఏడీఓ అనిల్, టీఓ సతీశ్, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు ఉన్నారు.