నల్లగొండ, మార్చి 19 : ఓటు హకు కలిగిన ప్రతి మహిళా ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా టీటీడీసీలోని జిల్లా సమాఖ్య భవనంలో ‘క్రమబద్ధమైన ఓటర్ల విద్య’ అంశంపై మహిళా సంఘాలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి మహిళా ప్రలోభాలకు గురికాకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేలా ఓటు హకును వినియోగించుకోవాలన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఆలోచించి సమాజానికి ఉపయోగపడే వారికి ఓటు వేయాలని సూచించారు. నల్లగొండ జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని, ఈ ప్రభావం ఎన్నికల్లో కనిపించాలని పిలుపునిచ్చారు. మహిళల్లో ఓటు చైతన్యం తీసుకొచ్చేందుకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు తెలిస్తే వెంటనే సీ-విజిల్ లేదా 1950 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనదని, అం దువల్ల ప్రతి ఒకరూ తమ ఓటు హకును జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి, అడిషనల్ డీఆర్డీఓ శారద పాల్గొన్నారు.
క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఎఫ్ఎస్టీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, ర్యాలీలకు, వాహనాల అనుమతులను పరిశాలించాలని సూచించారు. నగదు స్వాధీనం చేసుకుంటే సంబంధిత పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా నియంత్రణలో ఉంచాలని, ఆ విషయాన్ని తక్షణమే జిల్లాస్థాయి గ్రీవెన్స్ కమిటీకి తెలియజేయాలని తెలిపారు. ఎస్ఎస్టీ బృందాలు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, చెక్పోస్టుల్లో అందుబాటులో ఉండాలని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, టి.పూర్ణచందర్, డీఆర్డీఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఏఆర్వోలు పాల్గొన్నారు.