మిర్యాలగూడ: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మిర్యాలగూడ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్దార్ద అన్నారు. గురువారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 20మంది పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారిలో చిలక బాల్రెడ్డి, కృష్ణ, నాగరాజు, ఉదయ్, రమణ, కోటి, నరసింహ, నవీన్, రాఘవేంద్ర, నగేశ్, ప్రవీణ్, ఆచయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, కుర్ర విష్ణు, శ్రీనివాస్గౌడ్, స్రవంతి, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, మనోహర్రెడ్డి ఉన్నారు.