మునుగోడు: ఈ నెల 8న నల్లగొండలో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రంలో మహాసభ కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో చాపల శ్రీను, బెల్లం శివయ్య, ఈద యాదయ్య, భీమనపల్లి స్వామి, మాలాద్రి, పాండు, వెంకన్న, పిట్టల రాములు పాల్గొన్నారు.