నల్లగొండ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 04 : వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ పంటల సాగులో పలు సలహాలు, సూచనలు చేయాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోషియేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి యాదగిరిగౌడ్, అభిలాశ్రెడ్డి, నవీన్, అబ్దుల్ సత్తార్, కీర్తన, పీఏ రాంప్రసాద్ పాల్గొన్నారు.