దేవరకొండ, ఫిబ్రవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుంచి
టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. నియోజకవర్గంలో 1.60 లక్ష ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. పార్టీలో చేరినవారిలో శోభన్, వల్లపు శేఖర్తో పాటు మరో 20మంది ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణా సురేశ్ గౌడ్, రైతు బంధు మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, సర్పంచ్ రేపాని ఇద్దయ్య, మాజీ ఎంపీటీసీ కాశీరెడ్డి రవీందర్రెడ్డి, అనుపటి లక్ష్మయ్య, సుదర్శన్, సత్యనారాయణ, సైదులు పాల్గొన్నారు.