పెద్దఅడిశర్లపల్లి, మే 21 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని దుగ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, ముచ్చర్ల ఏడుకొండల్యాదవ్, వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, సర్పంచ్ నర్రావుల జయమ్మాలచ్చిరెడ్డి, తోటకూరి పరమేశ్, గుడిగోపురం విజయేందర్రెడ్డి, ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, బుషిపాక శ్రీనివాస్, నగేశ్, శీలం శేఖర్రెడ్డి, గొర్ల శ్రీను, మద్దిమడుగు కర్ణయ్య, సుధాకర్రెడ్డి, కృష్ణ, అంతిరెడ్డి, మద్దిమడుగు అచ్యుత్, రవి పాల్గొన్నారు.