చిలుకూరు, జనవరి 10 : మండలంలోని దూదియతండా సర్పంచ్ నందలాల్ మంగళవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో కోదాడలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్లో చేరతున్నారని అన్నారు.
గ్రామాల్లో నాయకులం దరూ పార్టీ కోసం సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణచైతన్య, వాసు, సక్రాం, నాగేశ్వరరావు పాల్గొన్నారు.