నేరేడుచర్ల, మే 29 : నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జడ్పీ సీఈఓ అప్పారావు సిబ్బందిని హెచ్చరించారు. గురువారం నేరేడుచర్ల మండల పరిధిలోని సోమారం, బూరుగులతండా, బోడలదిన్న గ్రామ పంచాయతీల్లోని నర్సరీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సరీల నిర్వహణపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, ఏపీఓ నాగేందర్, ఏపీఎం శేఖర్, కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.