నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ కృష్ణ ( Tahasildar Krishna) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు. గుండ్రంపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి సంబంధించన మ్యూటేషన్ కోసం రూ.2లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
తహసీల్ కార్యాలయంలో వ్యూహం ప్రకారం మాటువేసిన ఏసీబీ అధికారులు గురువారం తహసీల్దార్ గుగులోత్ కృష్ణా , మరో ప్రైవేట్ వ్యక్తి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నాంబర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది లంచాలకు పాల్పడితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.