మాల్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి అన్నారు.
ఆదివారం చింతపల్లి మండల పరిధిలోని గొల్లపల్లి, శాయిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకు లు శాయిరెడ్డిగూడెం సర్పంచ్ కేశగోని రవీందర్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కుప్పుకున్నారు.
పార్టీలో చేరిన వారిలో మాదగోని రాజేశ్గౌడ్, బొల్లెదు మహేశ్ యాదవ్, కేశగొని మహేశ్గౌడ్ చేరారు. కార్యక్రమంలో గండేటి బాలకృష్ణ, నక్కనమోని పరమేశ్, అనంతుల నర్సంహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.