మునుగోడు, ఆగస్టు 15 : మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు, ఆయన భార్య సైదమ్మ శుక్రవారం ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ దంపతులు కోతులారం గ్రామంలో వినూత్నంగా 7 ఎకరాల్లో కలబంద సాగు చేస్తున్నారు. వీరి కృషికి గుర్తింపుగా ఆర్ సి ఎఫ్ సి సిఫార్సుతో కేంద్ర ఆయుష్ విభాగం ప్రత్యేక ఆహ్వానం మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.