కోదాడ, మే 5 : కోదాడ మున్సిపాల్టీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన యాదవనగర్లోని మున్సిపల్ స్థలంలో తెల్లవారే సరికి పెద్ద డబ్బా కొట్టు వెలిసింది. వార్డుకు చెందిన ఓ నాయకుడి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు వార్డుకు చెం దిన పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కోదాడ ప్రధాన రహదారి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణకు, టెలికాం కార్యాలయం ప్రహరీని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కొం దరు ఇష్టారాజ్యంగా డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని కిరాయిలకు ఇస్తున్న విషయం అందరికీ విదితమే. పట్టణంలో ఎన్నో మున్సిపల్ స్థలాలను ఆక్రమించి దాదాపు 150 నుంచి 200 బడ్డీ కొట్లు ఏర్పాటు చేశారు.
దీంతోపాటు పలువురు చిరు వ్యాపారులు వీధులకిరువైపులా కాల్వలపై కూడా చిన్న బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో సదరు బడ్డీ కొట్లను తొలిగించే ప్రయత్నాలు జరిగాయి తప్పితే తొలిగించలేదు. తాజాగా 32వ వార్డులో మున్సిపాలిటీ వాహనాలు నిలిపే స్థలం లో ఓ భారీ డబ్బా కొట్టు వేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని వార్డు ప్రజలు విమర్శిస్తున్నారు. దానిని తొలిగించాలని కోరుతున్నారు.