నల్లగొండ మండలంలో కొద్దిరోజుల నుంచి కలకలం రేపుతున్న చిరుత పులి బుధవారం చందనపల్లి డంపింగ్ యార్డు సమీపంలో విఘతజీవిగా కనిపించింది. తమ పందులు కనిపించడం లేదని పెంపకందారులు వెతుకుతున్న క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ శివారులో చిరుత మృతదేహం ఉందన్న విషయం బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల జనం చూసేందుకు బారులు దీరారు. అటవీ శాఖ అధికారులు చిరుత మృతదేహానికి పోస్టుమార్టం చేసి రిపోర్ట్స్ను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పంటలను నాశనం చేస్తున్న పందులను చంపేందుకు రైతులు పెట్టిన విషం కారణంగా చిరుత మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతుండగా, నివేదిక వచ్చాక స్పష్టత కాగా, నల్లగొండ మండలంలోని కేశరాజుపల్లి, శేషమ్మగూడెం జంగాల కాలనీ, చందనపల్లి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు నెల రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, శేషమ్మగూడెం సమీపంలో అధికారులు ఆనవాళ్లు గుర్తించినట్లు ధ్రువీకరించారు. చనిపోయింది ఆడ చిరుత కాగా, దాంతోపాటు చిరుత పిల్లను కూడా చూసినట్టు స్థానికులు కొందరు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి జాడ కనిపెట్టడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే చిరుత మృత్యువాత పడినట్టు పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు చిరుత కారణంగా ప్రాణనష్టం జరిగి ఉంటే పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, చిరుత పిల్ల కూడా ఉండి ఉంటే అది ఏమైనట్టు అన్నది చర్చనీయాంశంగా మారింది.
నల్లగొండ, మార్చి 29: నల్లగొండ మండలంలో కలకలం రేపిన చిరుత బుధవారం చందనపల్లి సమీపంలో చెత్త డంపింగ్ యార్డులో మృతి చెంది కనిపించింది. కేశరాజుపల్లిలో నెలల క్రితం చిరుత సంచరించినట్లు స్థ్దానికులు గుర్తించారు. ఆ తర్వాత శేషమ్మ గూడెం పరిధిలోని జంగాల కాలనీలో పర్వతం మహేశ్ నల్లగొండ నుంచి కాలనీకి వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కత్వ దగ్గర బైక్ ఆపి మూత్ర విసర్జన చేస్తుండగా కత్వా కింద పొలంలో పులిని చూశాడు. ఆ సమయంలో చిరుత ఆయన మీదకు వచ్చే ప్రయత్నం చేసింది. పొలంలోని నీళ్ల కారణంగా మళ్లీ అందులోనే పడడంతో మహేశ్ బైక్ తీసుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని అప్పుడే ఆయన అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు మాత్రం చిరుతే అని గుర్తించినప్పటికీ మిన్న కుండ ఉన్నారు.
పది రోజుల క్రితం చందన పల్లి సమీపంలోని డంపింగ్ యార్డు పరిధిలో సంచరిస్తున్నట్లు అక్కడి రైతు బొడ్డుపల్లి శ్రీనివాస్ చూసి పక్క రైతులను అప్రమత్తం చేశారు. దాంతో రాత్రి పూట పొలాల దగ్గరకు వెళ్లడం రైతులు మానేశారు. అయితే శేషమ్మ గూడెం పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన రుద్రాశ్రీ రాములు, శ్రీనివాస్, బండమీది కిరణ్, రుద్రాక్షి యాదయ్యకు చెందిన 25 పం దులు డంపింగ్ యార్డులో సమీపంలోని సీతారెడ్డి, సత్తిరెడ్డి తోటలు, వరి పొలాల్లో ఉండేవి. పందు పొలాలు నాశనం చేస్తుండడంతో సమీప రైతులు పందుల కోసం తౌడుతో కూడిన శనగ పప్పులో విషాహారం పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆహారం తిని 25 పందులు ఈ వారం పది రోజుల్లో మృత్యువాత పడ్డాయి. అలా చనిపోయిన పందిని తిని చిరుత మృతి చెందినట్లు స్థానికులు, అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత పక్కన ఉన్న ఒక్క పంది మినహాయిస్తే ఏ ఒక్క పంది అవయవం దెబ్బ తినలేదు. చిరుత పక్కన ఉన్న పంది అవయవమే అది తిన్నట్లు ఉంది.దాంతో చిరుతను ఫారెస్ట్ అధికారులు పశు సంవర్ధక శాఖ అధికారులతో పోస్ట్ మార్టం చేయించి హైదరాబాద్ ఫొరెన్సిక్ డిపార్టమెంట్కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతనే ఎలా చనిపోయిందనే అనే విషయంపై స్పష్టత రానుంది.
జంగాల కాలనీలో చిరుతతో పాటు దాని పక్కన చిరుత పిల్ల కూడా ఉన్నట్లు అక్కడి స్థ్దానికులు చెబుతున్నారు. బుధవారం చందనపల్లి డంపింగ్ యార్డ్డులో చనిపోయిన చిరుత వయసు మూడు నుంచి నాలుగున్నరేండ్లు ఉన్నట్లు అంచనా. డంపింగ్ యార్డులో ప్రాంతంలో చిరుత పిల్ల కూడా తిరిగినట్లు రైతులు చెబుతునారు. శేషమ్మ గూడెం సమీపంలో చిరుత ఉన్నట్లు అక్కడి వారు అన్నప్పుడే ఫారెస్ట్ అధికారులు క్షేత్ర స్థ్దాయిలో ఆనవాళ్లు చూసి గుర్తించారు. కానీ అది అప్పటి నుంచి కనిపించకుండా పోయి మృత్యువాత పడింది. అయితే చిరుత చనిపోయినప్పటికీ పిల్ల మాత్రం కనిపించక పోగా చిరుత ఒక్కటే ఉందని దానికి పిల్ల లేదని అటవీ అధికారులు అంటున్నారు.
పులి చనిపోయిందనే సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున దాన్ని చూడడానికి కదిలి వచ్చారు.
జిల్లా కేంద్రానికి ఐదు కిలో మీటర్ల దూరం నిత్యం జనం తిరిగే నల్లగొండ-నకిరేకల్ రహదారి సమీపంలో ఈ చిరుత మృతి చెందిందని విషయం తెలవడంతో అక్కడి జనాలు ఉలిక్కి పడ్డారు. పైగా డంపింగ్ యార్డ్డులో నిత్యం పదుల సంఖ్యలో పని చేయడం సమీప పొలాల్లో పొద్దున రాత్రి రైతులు సంచారం చేయడం. పొలాల మధ్యలోనే అది చనిపోవడం విషయం తెలుసుకొని ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ చిరుత మర్రిగూడ, నాంపల్లి నుంచి రావచ్చు అనేది ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. సాధారణంగా పగలు గుబురుగా ఉన్న ప్రాంతంలో పడుకొని రాత్రి చిరుత సంచరిస్తుంది.
చిరుత మృతి చెందిన ప్రాంతంలో శేషమ్మ గూడెం పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన రుద్రాశ్రీ రాము లు, శ్రీనివాస్, బండమీది కిరణ్, రుద్రాక్షి యాదయ్యకు 25 పందులు మృత్యువాత పడ్డాయి. అయితే ఈ పందులు పెంచుకుంటూ వాటిపై ఆధారపడ్డ ఆ పెంపకం దారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతులు కొందరు కావాలనే తమకు సమాచారం ఇవ్వకుండా విషాహారం పెట్టడం వల్ల ఆ పందులు చనిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ శివారులో చిరుత