నీలగిరి, డిసెంబర్ 30 : కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు.
అత్యధికంగా అభ్యర్థులు పరుగు పందెం, లాంగ్జంప్ పోటీల్లో వెనుకంజ వేశారు. ప్రధానంగా 1600 మీటర్ల పరుగు పందెంలో అభ్యర్థులు వెనుదిరిగారు. ఈవెంట్స్కు 1,347 మంది హాజరు కావాల్పిండగా అందులో 1,182 పాల్గొనగా కేవలం 563 మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షకు అర్హత సాధించారు.