నల్లగొండ మున్సిపాలిటీకి మరో రూ.87 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సంస్థ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 23న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఇప్పటికే జరుగుతున్న రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, ఇతర పనుల గురించి వివరిస్తూ మరిన్ని నిధుల అవసరం అవుతున్నాయని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విజ్ఞప్తి మేరకు కేటీఆర్ తక్షణమే స్పందిస్తూ నిధుల విడుదలకు ఆదేశించారు. దాంతో సోమవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రూ.1300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా ముమ్మరంగా సాగుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చేందుకు ఇప్పటికే రూ.1,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు మంజూరైన విషయం తెలిసిందే. నల్లగొండను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధ్ది పనులపైనా ఎప్పటికప్పుడు సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.75 కోట్లతో ఐటీ హాబ్ పూర్తి కాగా వచ్చే నెల 2న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఎన్జీ కాలేజీకి కొత్త భవనం, ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి.
ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, ఫుట్పాత్ల నిర్మాణం, చెట్ల పంపకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే వీటి పనుల పూర్తికి మరిన్ని నిధులు అవసరం అవుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గత శనివారం స్వయంగా కేటీఆర్ను కలిసి నిధుల మంజూరీ కోసం విజ్ఞప్తి చేశారు. నల్లగొండ అభివృద్ధ్దిపై ప్రత్యేక శ్రద్ధ్దతో ఉన్న మంత్రి కేటీఆర్ వెంటనే తగిన చర్యలకు ఆదేశించారు. దీంతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ) నుంచి ఇప్పటికే కొనసాగుతున్న ప్రధాన రహదారుల పనులకు అదనంగా మరో రూ.32 కోట్ల రూపాయలను మంజూరీ చేశారు. అందులో క్లాక్టవర్ నుంచి బస్టాండ్ మీదుగా పెద్దబండ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులకు రూ.14 కోట్లు, డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా కేశరాజుపల్లి వరకు జరుగుతున్న పనుల కోసం మరో రూ.18 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తికానున్నాయి.
ఇక ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఓ వైపు జరుగుతుండగా వార్డుల్లో మిగిలి ఉన్న అభివృద్ధ్ది ప నులపైనా దృష్టి సారించారు. పట్టణంలోని మున్సిపల్ వార్డుల్లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వాటర్ వర్క్స్ లాంటి అభివృద్ధి పనుల కోస రూ.55 కోట్లను మంజూరీ చేశారు. ఒక్కో వా ర్డుకు రూ. కోటి చొప్పున మొత్తం 48 వార్డులకు రూ.48 కోట్లు, మున్సిపాలిటీలో ఏడు విలీన గ్రామాల అభివృద్ధి కోసం మరో రూ.7 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. పనుల ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్డీఎఫ్ నుం చి వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఒక ద ఫా పూర్తి చేశారు. ఇంకా మిగిలి ఉన్న పనులన్నింటినీ ప్రసు ్తత నిధులతో పూర్తి చేసేలా చర్యలు తీసుకు ంటున్నారు. దీని వల్ల ప్రధాన రహదారులు, జంక్షన్లతో పాటు పట్టణం నలుమూలల సంపూర్ణంగా అభివృద్ధ్ది జరుగనుంది.
నల్లగొండ అభివృద్ధ్దిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్దతో ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరో రూ.87 కోట్లను కేటాయించారు. వీటితో ప్రధాన రహదారుల విస్తరణ పనులు పూర్తి కావడంతో పాటు వార్డుల్లో మిగిలి ఉన్న అభివృద్ధ్ది పనులను చేపట్టనున్నాం. ఇప్పటికే 1300 కోట్లతో నల్లగొండ రూపురేఖలు మార్చేలా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. వీటన్నింటిని పూర్తి చేసి సరికొత్త నల్లగొండను ఆవిష్కరించడమే లక్ష్యం. ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం కేసీఆర్కు, ఐటీ మంత్రి కేటీఆర్కు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికి నల్లగొండ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. వీరికి ప్రజల తరుఫున జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఎమ్మెల్యే కంచర్లభూపాల్రెడ్డి