చందంపేట, ఆగస్టు 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల్లి గేటు వద్ద పోలేపల్లి, కాట్రావత్తండా, మానావత్తండా, బండమీదితండా, బంజారా తండా, వెంకట్తండాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 300 మంది ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. 22 ఏండ్ల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మారడంతోపాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిందని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశాయని తెలిపారు. దళితుల సమగ్రాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, గ్రామాల్లో సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, సర్పంచ్ దొండేటి మల్లారెడ్డి, నాయకులు లోకసాని తిరుపతయ్య, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి, మోహన్కృష్ణ, అనంతగిరి, మహేశ్, శంకర్నాయక్, కొండల్రెడ్డి, మున్నయ్య, బలవద్దిరాజు, హరిలాల్, శోభన్, రమేశ్ పాల్గొన్నారు.